రూ. 83,500 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ: మంత్రి

NTR: 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ. 83,500 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక (ఏసీపీ) లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకునేందుకు బ్యాంకులు కృషిచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్తో కలిసి 2025-26 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు.