సోమేశ్వరాలయంలో కార్తీక దీపోత్సవం

సోమేశ్వరాలయంలో కార్తీక దీపోత్సవం

JN: పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీన ర్సింహస్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. దీపోత్సవంలో పాల్గొన్న మహిళలకు తాంబూలం, ప్రసాదం వాయినంగా అర్చకులు అందజేశారు. ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య భక్తులు ఉన్నారు.