సచివాలయ ఉద్యోగుల కొట్లాట

సత్యసాయి: గోరంట్ల మండలం కమ్మవారిపల్లిలో పంచాయతీ సెక్రటరీ ఫరూక్ అబ్దుల్లా, ఇంజినీరింగ్ అసిస్టెంట్ బాలాజీ ఇద్దరూ కొట్టుకున్నారు. పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ అసిస్టెంట్తో కలిసి సోమవారం కమ్మవారిపల్లి ఎస్సీ కాలనీలో సర్వే చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో మాటమాట పెరగ్గా బాలాజీ తనను కింద పడేసి కొట్టడంతో చేయి విరిగినట్లు తెలిపారు.