రైల్వే స్టేషన్లో కూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి
సత్యసాయి: అనకాపల్లి రైల్వే స్టేషన్లో నూతనంగా నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఇవాళ కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. రైల్వే పట్టాలపై బ్రిడ్జి నిర్మాణపు గడ్డర్లు పడటంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమైంది. రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా తొలగింపు పనులను చేపట్టారు.