పిల్లలకు చదువే ఆస్తి: ఎమ్మెల్యే సింధూర రెడ్డి
సత్యసాయి: పుట్టపర్తిలోని బీడుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లలకు చదువే ఆస్తి అని, వారి ఎదుగుదలకు తల్లిదండ్రులే తొలి గురువులని ఆమె అన్నారు. సెల్ఫోన్ వాడకం వల్ల విద్యార్థుల జీవితంపై దుష్ప్రభావం పడుతుందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.