కాండం తొలుచు పురుగు నివారణపై అవగాహన

కాండం తొలుచు పురుగు నివారణపై అవగాహన

SDPT: వరి పంటలను నష్టపరుస్తున్న కాండం తొలుచు పురుగు నివారణపై సిరిసిల్ల బాలు జర్మీనన్ రామ్ అగ్రికల్చరల్ కళాశాల విద్యార్థులు రైతులకు అవగాహన కల్పించారు. ఇవాళ సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్‌లో క్షేత్రస్థాయిలో వరి పంటలను పరిశీలించారు. అధిక నత్రజని ఎరువుల వినియోగాన్ని నివారించి క్రమం తప్పకుండా పొలాలను పరిశీలించి పురుగు ఉద్ధృతిని తగ్గించుకోవడానికి గల సలహాలు, సూచనలు చేశారు.