శిశు మరణాలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్
WNP: జిల్లాలో మాత శిశు మరణాలు చోటు చేసుకోకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ తన చాంబర్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గర్భిణీల్లో రక్తహీనత ఉన్న వారిని గుర్తించి వారికి ముందస్తుగా పోషకాహారం అందించి, ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.