పవన్ కళ్యాణ్కు మేయర్ సన్మానం

GNTR: UPSC సివిల్స్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 146వ ర్యాంకు సాధించిన గుంటూరు నగరానికి చెందిన చల్లా పవన్ కళ్యాణ్ను మంగళవారం నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర నగర పాలక సంస్థలోని తన ఛాంబర్లో శాలువా కప్పి సత్కరించారు. మేయర్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ లాంటి యువకులే భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన సాధించిన విజయంతో గుంటూరుకు గౌరవం దక్కిందన్నారు.