పట్టుబడితే కఠిన శిక్షలు: కలెక్టర్
ELR: జిల్లాను మాదకద్రవ్య రహితంగా రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ వెట్రిసెల్వి కోరారు. మంగళవారం కలెక్టరేట్లో ఆమె మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలతో యువత భవిష్యత్తు అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతలో అవగాహన కల్పించాలని సూచించారు. మాదకద్రవ్యాల విక్రయాలు, రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.