'పదవులు ఎవరికి ఇవ్వాలో అధిష్టానం చూసుకుంటుంది'

TG: రాష్ట్రంలో ఎవరెవరికి ఎప్పుడు పదవులు ఇవ్వాలో అధిష్టానం చూసుకుంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు. గతంలో కొన్ని కమిటీల్లో తన పేరు లేకపోయినా, భవిష్యత్తులో మరో కమిటీలో అవకాశం ఉండచ్చొని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గాంధీభవన్లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షితో సమావేశం అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.