గుంటూరు జీజీహెచ్‌పై వైసీపీ ఫైర్

గుంటూరు జీజీహెచ్‌పై వైసీపీ ఫైర్

గుంటూరు: జీజీహెచ్‌లో సిబ్బంది తీరుపై వైసీపీ మండిపడింది. రోగులను పట్టించుకోకుండా వదిలేసి సిబ్బంది కబుర్లలో మునిగారని విమర్శించింది. ఎక్స్‌రే టెక్నీషియన్ అనిల్ రోగులతో దురుసుగా ప్రవర్తించారంది. సూపరింటెండెంట్‌కు ఎవరూ భయపడరని అతడు వెటకారం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితికి ఇదే సాక్ష్యమంటూ సీఎం, మంత్రిని ఎక్స్‌లో ప్రశ్నించింది.