భారత రాజ్యాంగ ప్రస్తావనను చదవాలి: కలెక్టర్
సత్యసాయి: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం 11:30 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో రాజ్యాంగ ప్రస్తావనను సామూహికంగా నిర్వహించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి ప్రభుత్వ శాఖలో తగిన గౌరవంతో నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.