గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
SRPT: జిల్లాలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్పీ నరసింహతో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. మగ్దుంనగర్ అగ్రికల్చర్ కాలేజీ, కోదాడ నవోదయ స్కూల్ శంకుస్థాపనతో పాటు మట్టపల్లి దేవాలయ సందర్శనలో ప్రోటోకాల్, బందోబస్తులో లోటుపాట్లు ఉండరాదని స్పష్టం చేశారు.