ఒకరోజు ముందే పింఛన్ల పండగ

ఒకరోజు ముందే పింఛన్ల పండగ

AP: ఈ నెల 31న సీఎం చంద్రబాబు రాజమండ్రిలో పర్యటించనున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం గున్నేపల్లిలో పింఛన్ల పంపిణీలో పాల్గొననున్నారు. జూన్ 1న ఆదివారం కావడంతో ఒకరోజు ముందే పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. పంపిణీ తర్వాత గున్నేపల్లి గ్రామస్తులతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం నియోజకవర్గ పార్టీ నేతలతో సమావేశమై సాయంత్రానికి అమరావతి చేరుకోనున్నారు.