దేవాలయ భూములపై కలెక్టర్‌కు ఫిర్యాదు

దేవాలయ భూములపై కలెక్టర్‌కు ఫిర్యాదు

NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తిలో శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయ భూమి, సర్వే నం.201లోని ప్రభుత్వ భూమి గుండా ఓ ప్రైవేట్ వెంచర్ కోసం 40 ఫీట్ల రోడ్డు వేయడంపై బీజేపీ నేత మర్రి హరీష్ రెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. స్థలాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆర్డీఓను, వెంచర్ డీటీసీపీ అనుమతులపై పునఃసమీక్ష జరపాలని ఆదేశించారు.