క్రికెట్ జట్టుకు యోధ శంకర్ రెడ్డి ఎంపిక
KRNL: ఆదోనిలో క్రీకెట్ అసోసియేషన్ క్రీడాకారుడు యోధ శంకర్ రెడ్డి ఈ నెల 4 నుంచి 23వ తేదీ వరకు కడపలో జరిగే అండర్-14 ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలకు కర్నూలు జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపిక అయ్యారు. ఆదోని క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విట్టా రమేశ్, వైస్ ప్రెసిడెంట్ ముజీబ్, ఆదోని జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప, సెక్రటరీ వెంకటేశ్,క్రీడాకారుడికి శుభాకాంక్షలు తెలిపారు.