తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. స్వామివారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 84,113 మంది భక్తులు దర్శించుకోగా.. 33,868 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా.. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.12 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.