VIDEO: 'మురుగునీటి శుద్ధికి STP ప్లాంట్లను ఏర్పాటు చేయాలి'
నిజామాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల లేమి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని MLA ధన్పాల్ సూర్యనారయణ అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. నగరంలో సరైన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరంతా చెరువుల్లో కలుస్తోందన్నారు. దీంతో నగరమంతా తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోందని అసహనం వ్యక్తం చేశారు. మురుగునీటి శుద్ధి కోసం ప్రభుత్వం వెంటనే STP ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు.