ఎస్‌ఐహెచ్‌ఎం సిబ్బంది వేతన బకాయిలు విడుదల

ఎస్‌ఐహెచ్‌ఎం సిబ్బంది వేతన బకాయిలు విడుదల

TPT: తిరుపతి ఎస్‌ఐహెచ్‌ఎం సిబ్బంది 22 నెలలుగా పెండింగ్‌లో ఉన్న సుమారు రూ. 84 లక్షల వేతన బకాయిలను పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ చొరవతో విడుదల చేశారు. దీంతో సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయంలో మంత్రిని కలిసి టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు కూడా ధన్యవాదాలు తెలిపారు.