CMRF చెక్కులను పంపిణీ చేసిన మంత్రి
నంద్యాల జిల్లా బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి CMRF చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. ఇందులో 41 మంది లబ్ధిదారులకు రూ. 25.98 లక్షల విలువైన చెక్కులను ఆయన అందజేశారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని ఆయన వ్యక్తిగతంగా అడిగి తెలుసుకున్నారు. పేదల ఆరోగ్య రక్షణలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.