మేడిగడ్డ బ్యారేజీకి పెరుగుతున్న వరద
BHPH: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 6 గంటలకు బ్యారేజీలోకి 5,52,600 క్యూసెక్కుల వరద కొనసాగుతోందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. సోమవారం నుంచి మంగళవారం వరకు వరద ప్రవాహం 1.90 లక్షల క్యూసెక్కులు పెరిగిందని పేర్కొన్నారు. సుందిళ్ల పార్వతి బ్యారేజీ, ఎల్లంపల్లి, అన్నారం ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది.