హర్మూజ్లో ఇరాన్ 'టోల్' బాదుడు.. ఎంతంటే?
రోడ్డు మీద టోల్ కట్టడం చూశాం.. కానీ ఇప్పుడు సముద్రంలో కూడా 'టోల్ ప్లాజా' రాబోతోంది. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే చమురు ట్యాంకర్లకు ఇరాన్ భారీ షాక్ ఇచ్చింది. ఒక్కో ట్యాంకర్పై ఏకంగా రూ.18.90 కోట్లు వసూలు చేసేలా 'హర్మూజ్ మేనేజ్మెంట్ ప్లాన్'కు ఆ దేశ పార్లమెంట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో అంతర్జాతీయంగా చమురు రవాణా మరింత ఖరీదు కానుంది.