ఆర్డీఎస్ఎస్ పనులు వంద శాతం పూర్తి చేయాలి: మంత్రి
ATP: జిల్లాలో ఆర్డీఎస్ఎస్ పథకం పనులు వంద శాతం పూర్తి చేయాలని మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. వేసవిలో తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. వ్యవసాయ కనెక్షన్లను వెంటనే మంజూరు చేయాలని అధికారులకు సూచించారు.