రేపటి నుంచి మూడు రోజులు జాగ్రత్త
TG: రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని.. రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగొచ్చని తెలిపింది. ప్రజలు అత్యవసమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది.