ఢిల్లీ పేలుడు.. 42 కీలక ఆధారాల సేకరణ
ఢిల్లీ పేలుడు ఘటన జరిగిన ప్రదేశం నుంచి ఫోరెన్సిక్ బృందం కీలక వస్తువులను సేకరించింది. పేలుడు పదార్థాలు, ఇతర ఆధారాలను నిర్ధారించడానికి ఘటనా స్థలం నుంచి మొత్తం 42 వస్తువుల శాంపిల్స్ను తీసుకుంది. ఈ 42 శాంపిల్స్ను ల్యాబ్లో పరీక్షలు జరపనున్నారు. ఈ పరీక్షల ఫలితాలు పేలుడుకు ఉపయోగించిన పదార్థాలను, పేలుడు వెనుక కుట్రను తేల్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి.