పాక్తో మ్యాచ్ను బహిష్కరించాలి: పహల్గామ్ బాధితురాలు

పాక్తో మ్యాచ్ను భారత్ బహిష్కరించాలని పహల్గామ్ బాధితురాలు కోరుతున్నారు. 'మా కళ్లల్లో ఇంకా నీళ్లు ఆరిపోలేదు. అప్పుడే పాక్తో మ్యాచ్ కూడా జరుగుతుందా?' అని బాధితురాలు కిరణ్ బెన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ కొనసాగించాలన్న బీసీసీఐ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశం ఐక్యంగా ఉండాలని ఆమె కోరింది. పాక్తో భారత్ ఎలాంటి సంబంధాలు కలిగి ఉండకూడదని నొక్కి చెప్పింది.