మూగి తాతను దర్శించుకున్న ఎంపీ
KRNL: దేవనకొండ మండల కేంద్రంలోని దివానే మూగి తాత ఉరుసు సందర్భంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు దర్గాను ఇవాళ సందర్శించారు. దర్గా నిర్వాహకులు ముస్లిం సంప్రదాయంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. టీడీపీ కార్యాలయంలో నాయకులతో సమావేశమై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.