ఆరేళ్ల తర్వాత సీబీఐ కోర్టుకు జగన్

ఆరేళ్ల తర్వాత సీబీఐ కోర్టుకు జగన్

AP: మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో జరగనుంది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో, కోర్టు ఆదేశాల మేరకు దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత జగన్ నేరుగా ఈ విచారణకు హాజరుకానున్నారు.