కడప కార్పొరేషన్ను గాలికి వదిలేశారు: జిలాన్ బాషా
కడప కార్పొరేషన్ను అవినీతికి కేంద్రంగా మార్చేశారని TDP అధికార ప్రతినిధి జిలాన్ బాషా విమర్శించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ప్రజలకు కనీస సేవలు అందించకుండా కార్పొరేషన్ను నిర్లక్ష్యంగా వదిలేశారని మండిపడ్డారు. 14, 15వ ఫైనాన్స్ నిధులు గల్లంతు చేశారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడుతున్న MLA మాధవి రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు.