జర్నలిస్టుపై దుండగుల దాడి
HYD: న్యూస్ కవరేజీ కోసం వెళ్లిన జర్నలిస్టుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన అమీన్పూర్ పరిధిలోని జవహర్నగర్ కాలనీలో చోటుచేసుకుంది. అమీన్పూర్ సర్వే నం.630లోని అక్రమ నిర్మాణాలను శుక్రవారం తహసీల్దార్ వెంకటేష్ పరిశీలించారు. కవరేజీ కోసం వెళ్లిన విఠల్ను టార్గెట్ చేసిన 15 మంది దుండగులు అర్థరాత్రి అతడి ఇంటి అద్దాలను, వస్తువులను ధ్వంసం చేశారు.