నవోదయ పాఠశాలకు జశ్విత ఎంపిక

నవోదయ పాఠశాలకు జశ్విత ఎంపిక

SKLM: మెలియాపుట్టి మండలం పెద్దపద్మపురం ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఆజారి జశ్విత నవోదయ పాఠశాలకు ఎంపికయ్యారు. మంగళవారం నవోదయ విద్యాసంస్థ విడుదల చేసిన ఫలితాలలో బాలికల కోటాలో సీటు సాధించారు. విద్యార్థి ఉత్తమ ఫలితం సాధించడం పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.