రంజాన్ తోఫా పంపిణీ చేసిన మంత్రి
కృష్ణా: మచిలీపట్నం జైహింద్ హై స్కూల్ ఎదురుగల గాడి ఖానా రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర 500 మంది పేదలకు రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అత్యంత పవిత్రంగా రంజాన్ ఉపవాసాలు, దీక్షలు ఆచరిస్తున్న ప్రతి ముస్లిం సోదరులకు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.