పంచాయతీ ట్రాక్టర్ను అమ్మేశారు?
ATP: స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా కదిరి(M) కాళసముంద్రం పంచాయతీకి మంజూరైన ట్రాక్టర్ను అమ్మేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వెనుక పంచాయతీ సిబ్బంది పాత్ర ఉన్నట్లు సమాచారం. 2024లో కదిరిలోని ఓ షోరూమ్ నుంచి అప్పటి పంచాయతీ కార్యదర్శి అబ్దుల్ మునాఫ్ ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నట్లు రికార్డుల్లో ఉన్నా.. గ్రామానికి రాకపోవడంతో ఈ అనుమానాలు వినిపిస్తున్నాయి.