నూతన కమిటీని ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే
NLR: కోవూరు మండలం పాటూరు గ్రామ వైసీపీ నూతన కమిటీని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ కమిటీని ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నూతన కార్యవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.