'సత్ప్రవర్తనతో శాంతియుతంగా జీవించాలి'
KRNL: పెద్దకడబూరు గ్రామంలోని పోలీసు స్టేషన్ ఆవరణలో ఆదివారం ఎస్సై నిరంజన్ రెడ్డి రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్లుగా నమోదైన వ్యక్తులు సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో ఘర్షణలు, గొడవలకు వెళ్లకుండా శాంతియుతంగా జీవనం కొనసాగించాలని సూచించారు.