మెట్లపై నుంచి జారిపడి.. విద్యార్థిని మృతి

మెట్లపై నుంచి జారిపడి.. విద్యార్థిని మృతి

SRD: జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. జహీరాబాద్ (మ) బూచినెల్లి మైనార్టీ బాలికల గురుకులంలో షాదిహా మెహరీన్ (14) అనే విద్యార్థిని శనివారం రాత్రి భోజనం చేసి, తన రూమ్‌కి వెళ్లే క్రమంలో మెట్లపై నుంచి జారి కిందపడింది. దీంతో ఆమె తలకు బలమైన గాయం కావడంతో HYDAలో గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.