జిల్లా నూతన కలెక్టర్గా హరేంద్రప్రసాద్
KKD: రాష్ట్రంలో పలువురు IAS అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టర్గా హరేంద్రప్రసాద్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న షణ్మోహన్, APEDB సీఈవోగా బదిలీ అయ్యారు. దీంతో నూతన కలెక్టర్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.