శ్రీ శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయానికి విరాళాలు
KRNL: ఆలూరులోని శ్రీ శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణానికి భక్తులు ఉదారంగా ఇవాళ విరాళాలు అందజేస్తున్నారు. మాజీ మంత్రి మారెప్ప అల్లుడు చినబాబు అజయ్ రూ.50,000, జోల్దరాసి నానీ మురళి కృష్ణ రూ.20,000 విరాళంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దాతలను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.