నాచగిరి ఉత్సవాలకు ఎంపీకి ఆహ్వానం

నాచగిరి ఉత్సవాలకు ఎంపీకి ఆహ్వానం

SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ఈ నెల 8 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుకు ఆలయ ఈవో రంగాచారి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఉత్సవాలలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపాలకృష్ణ శర్మ, కృష్ణమాచార్యులు, సుధాకర్ పాల్గొన్నారు.