మొక్కల ప్రాముఖ్యతపై అవగాహన
ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోటనీ విద్యార్ధులు ఫీల్డ్ విజిట్, బొటానికల్ టూర్లో భాగంగా గురువారం పద్మాపురం బొటానికల్ గార్డెన్ను సందర్శించారు. ఈ ఫీల్డ్ విజిట్లో కళాశాల బోటనీ అధ్యాపకులు లచ్చన్న మొక్కలకు వచ్చే వ్యాధుల గురించి, ఔషధ మొక్కల ఉపయోగాలు విద్యార్ధులకు తెలిపారు. ప్రత్యేకంగా స్థానికంగా లభించే ఔషద మొక్కల ప్రాముఖ్యత, వినియోగాలను వివరించారు.