VIDEO: నీటి సంరక్షణపై రవాణా శాఖ పిలుపు
నంద్యాల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఇవాళ ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం జరిగింది. ఈనెల ‘వాటర్ పాజిటివ్ ఆంధ్ర’ థీమ్తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యాలయ పరిసరాల్లోని మొక్కలకు నీళ్లు పోసి నీటి సంరక్షణ అవసరాన్ని వివరించారు. ప్రతి ఒక్కరూ నీటిని ఆదా చేయాలని ఆయన పిలుపునిచ్చారు.