నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
భూపాలపల్లి 11 కేవి రాంనగర్ ఫీడర్పై లైన్ మరమ్మత్తులు మంగళవారం చేపట్టనున్నట్లు ఏఈ విశ్వాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ.. మరమ్మత్తుల కారణంగా రెడ్డికాలని, బస్టాండ్, గాంధి కాలేజీ రోడ్, సుభాష్ కాలని, రాంనగర్, ఎల్బీ నగర్, లక్ష్మినగర్, బానోత్ వీధి, పాత జంగేడు రోడ్ ప్రాంతాలలో ఉదయం 10.30 ని"ల నుంచి మధ్యాహ్నం 12.30 ని"ల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.