సీఎంఆర్ఎఫ్ తో ప్రజలకు ఆర్థిక భరోసా: MLA అనిల్ జాదవ్

ADB: సీఎంఆర్ఎఫ్తో ప్రజలకు ఆర్థిక భరోసా లభిస్తుందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బోథ్ మండల కేంద్రానికి చెందిన పెండం మల్లేష్ మంజూరు అయిన రూ. 17,500 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును నెరడిగొండ మండల కేంద్రంలో ఆదివారం అందజేశారు. వైద్య ఖర్చుల వివరాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమర్పించి తద్వారా లబ్ధి పొందాలని సూచించారు.