చలివేంద్రాన్ని ప్రారంభించిన శాప్ ఛైర్మన్
తిరుపతి పట్టణంలోని శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి దేవస్థానం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని శాప్ ఛైర్మన్ రవి నాయుడు ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవస్థానం ఛైర్మన్ మహేష్ యాదవ్, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.