VIDEO: ప్రజావాణికి విశేష స్పందన
NZB: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్.భూపతి రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజాపాలనలో భాగంగా చేపట్టిన ప్రజావాణిలో శుక్రవారం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. నియోజకవర్గ పరిధిలోని డిచ్పల్లి, ధర్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, మోపాల్ మండలాల ప్రజలు వివిధ సమస్యల నిమిత్తం ఎమ్మెల్యేను కలిశారు. ప్రజల సమస్యలను ఎమ్మెల్యే ఆలకించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు.