చలివేంద్రం కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

చలివేంద్రం కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కోనసీమ: రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో నామన సూరిబాబు నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం కేంద్రాన్ని శనివారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండువేశంలో బాటసారులు, ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.