'వారణాసి'.. అప్డేట్ ఇచ్చిన ప్రియాంక
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో 'వారణాసి' సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా.. మందాకిని పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై ప్రియాంక అప్డేట్ ఇచ్చింది. తన పాత్రకు తెలుగులో స్వయంగా డబ్బింగ్ చెప్పనున్నట్లు వెల్లడించింది. ఇక ఈ చిత్రం 2027 సమ్మర్లో విడుదలవుతుంది.