పసలదీవిలో ఉచిత పశువైద్య శిబిరం
WG: నరసాపురం మండలం పసలదీవిలో ఈ నెల 9న ఉచిత పశువైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ ఏడీ పి. చంద్ర శేఖర్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఏఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. శిబిరంలో పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. ఈ అవకాశాన్ని రైతులు, గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.