సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం

BDK: సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్లో పాల్వంచ మండలానికి చెందిన ఆదివాసి ఆణిముత్యం సీటు సాధించింది. పాల్వంచ మండలం గంగదేవి గుప్ప మారుమూల గ్రామానికి చెందిన కాక నాగలక్ష్మి సెంట్రల్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో తొలి విద్యార్థిగా సీటు సాధించింది. మంగళవారం తమ ప్రాంతానికి చెందిన ఆదివాసి బిడ్డ సీటు సంపాదించడం సంతోషకరమని స్ధానికులు తెలిపారు.