జేసీబీ గుంతలో పడి చిన్నారి మృతి
TPT: ఏర్పేడు మండలం చిందేపల్లి ఎస్టీ కాలనీ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. తోటి పిల్లలతో ఆడుకుంటూ కాలుజారి చెరువులోని జేసీబీ గుంతలో పడి ఎండ్ల సుస్మిత(6) మృతి చెందింది. సమాచారం అందుకున్న స్థానికులు మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.